Tuesday, April 30, 2024

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు
కమిటీహాల్స్, మల్టిపర్పస్‌పంక్షన్‌హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని

మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స, పాడిపరిశ్రమ అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించే కంటి వెలుగు రెండ విడుత నిర్వహణ, ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లా స్దాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడుతలో 827 బృందాలను ఏర్పాటు చేయగా, ఇప్పుడు 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు, వారికి ప్రత్యేకంగా వాహనాలను కూడా సిద్దం చేసినట్లు వివరించారు. గ్రేటర్ పరిధిలోని 91 వార్డులలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాల ఏర్పాటు కోసం కమిటీ హాల్స్, మల్టిపర్ఫస్ పంక్షన్ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్‌లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిభిరాల వద్ద సరైన పర్నెచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

వృద్దులను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 100 పనిదినాల పాటు ఈకార్యక్రమం ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈశిబిరాలు పనిచేస్తాయని తెలిపారు. ప్రతి బృందంలో ఒక డాక్టర్, ఒక కంటివైద్యులు, ఒక పార్మాసిస్ట్, ఆశావర్కర్‌లతో పాటు10 మంది వరకు ఉంటారని పేర్కొన్నారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని గిన్నీస్ బుక్‌లో నమోదయ్యే విధంగా విజయవంతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒకరు కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. మొదటి విడుతలో 1.54 కోట్ల మందికి కంటిపరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కళ్లద్దాలు అందజేసినట్లు వెల్లడించారు. ఈసారి కోటిన్నర మందికిపరీక్షలు చేసి 55 లక్షలమందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్‌లు అవసరమైన వారికి సరోజనీదేవి,ఎల్వీప్రసాద్ ఆసుపత్రులు మాత్రమే కాకుండా లయన్స్‌క్లబ్, రెడ్‌క్రాస్‌ఇతర స్వచ్చంద సంస్దలకు చెందిన ఆసుపత్రులు సేవలను వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అవసరమైన మందులు అన్ని శిభిరాల వద్ద అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒకరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నిర్వహించబడుతాయన్నారు. కార్పొరేటర్లు, కాలనీ బస్తీల కమిటీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని, పేద ప్రజలకు ఒక వరం లాంటిదని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ఈకార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్‌సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, రాజాసింగ్, కౌసర్ మొహినోద్దిన్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్,కలెక్టర్ అమయ్‌కుమార్, కమిషన్ లోకేష్‌కుమార్, హెల్త్ అదనపు డైరెక్టర్ పద్మజ, డా. వెంకటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News