Monday, April 29, 2024

మహిళ భూమిని కబ్జా చేసి…. నగ్నంగా ఊరేగించి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భూవివాదంలో ఓ మహిళపై దాడి చేసి ఆమెను నగ్నంగా ఉరేగించిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళకు మూడెకరాల భూమి ఉంది. మూడెకరాలలో అర ఎకరం భూమిని కొందరు కబ్జా చేయడంతో ఆమె ప్రశ్నించారు. దీంతో కబ్జాదారులు కుటుంబం మహిళ, ఆమె కుమారుడిపై దాడి చేశారు. ఆనంతరం ఆమెను వివస్త్రంగా చేసి నగ్నంగా ఊరేగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాధితురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే బయటపడింది. ఈ ఘటన 2023 జులై 31న జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News