Tuesday, April 30, 2024

ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ సంబరాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకల్లో ముందుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమాన్ని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్య లభిస్తున్నదని, సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంస్కృతి, స ంప్రదాయాలకు పెద్దపీట వేశారన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆలయాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఇల వైకుంఠంగా సర్వాంగ సుందరంగా మార్చారని అన్నారు. ధూప, దీప, నైవేద్య పథకంతో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఆర్చకులు, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నారిని అన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, విదేశీ విద్య అభ్యసించేలా పేద బ్రాహ్మణ పిల్లలకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.

విభిన్న మతాలు, బాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గాంధీజి కలులు కన్న గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. గత పాలకుల హయాంలో పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు, ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు. గత ప్రభుత్వాలన్ని పండుగలన్నింటిని చిన్నచూపు చూసినవే, తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్, ఆలయాలు, చర్చిలు, మసీదుల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించారని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయని, బోధకుల సంక్షేమానికి వేతనాలు అందజేస్తామని, బోదకుల సంక్షేమానికి వేతనాలు అందజేస్తామని వారిని ఓటు బ్యాంకుగా చూశాయి తప్పా ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ చెప్పినట్లుగానే సహకరిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News