Friday, March 29, 2024

తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సిఎం అన్నారు. ప్రత్యేకించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకండి అని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంత ఏకపక్షంగా ఫలితాలు రావడం ఆల్ ఇండియా రికార్డ్ అని, నా అనుభవంలో ఇలాంటి ఫలితాలు చూడలేదని ఆయన పేర్కొన్నారు. సాదారణంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఫలితాలు రావని.. కానీ, కెటిఆర్ తో సహా ఇతర నేతలంతా ఇరవై నాలుగు గంటలు ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. గెలిచినంత మాత్రాన గర్వం, అహంకారం రావొద్దన్నారు. గెలిచిన అభ్యర్థులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. ఇంత ఘన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటామని, మీకిచ్చిన హామీలన్నీ నేరవేరుస్తామని సిఎం అన్నారు. పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా చేపడుతామని తెలిపారు. 31, మార్చి నుంచి 57 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వృద్ధాప్యం పెన్షన్ ఇస్తామని.. అలాగే, ఉద్యోగుల వయోపరిమితిని త్వరలోనే పెంచుతామని సిఎం కెసిఆర్ తెలిపారు.

KCR Press Meet over Municipal Result at TRS Bhavan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News