Monday, April 29, 2024

మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి నెల మార్చి ప్రారంభమైంది. ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) ఖాతాలు యాక్టివ్‌గా ఉండేందుకు వాటిలో కనీస పెట్టుబడి పెట్టాలి. 2024 మార్చి 31 వరకు పిపిఎఫ్, ఎస్‌ఎస్‌వైలో కనీస మొత్తం డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతాలు పనిచేయవు. వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాలలో కనీస పెట్టుబడి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)
పిపిఎఫ్ ఖాతా ఉన్నవారికి కనీస డిపాజిట్ రూ. 500, అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే సదరు కస్టమర్ ఖాతా మూసివేస్తారు. దీనిలో డబ్బు డిపాజిట్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ గడువు ఉంటుంది. ఈ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయకపోతే ఖాతాను తిరిగి తెరవడానికి జరిమానా చెల్లించాలి. ఏడాదికి రూ.50 చొప్పున ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఒక సంవత్సరంలో రూ. 50కి బదులుగా రూ. 100 జరిమానా చెల్లించాలి.

పిపిఎఫ్ వివరాలు :
ప్రస్తుతం పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై 7.1 శాతం వడ్డీ వస్తోంది.
డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.అంటే ప్రతి సంవత్సరం ప్రధాన మొత్తానికి ఈ వడ్డీని కలుపుతారు.
పిపిఎఫ్ పథకంలో మొత్తం మూడు రిటర్న్‌లు, మెచ్యూరిటీ మొత్తం, వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఖాతాలకు 15 సంవత్సరాల వ్యవధి, దానిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు.
పిపిఎఫ్ పథకం కింద కనీసం 500 రూపాయలతో ఖాతాను తెరవవచ్చు.
ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)
సుకన్య సమృద్ధి యోజనలో ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై 8.2 శాతం వడ్డీ లభిస్తోంది.

ఎస్‌ఎస్‌వై వివరాలు :
ఆడపిల్ల పుట్టిన తర్వాత 10 ఏళ్ల లోపు ఖాతాను తెరవవచ్చు.
రూ.250 లకే ఈ ఖాతాను తెరవొచ్చు. దీనిలో ఏడాదికి 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
ఈ ఖాతాను ఏదైనా పోస్టాఫీసులో లేదా బ్యాంకు శాఖలో తెరవవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News