Monday, April 29, 2024

రెండేళ్లలో 3 కోట్ల కొత్త ఇన్వెస్టర్లు

- Advertisement -
- Advertisement -

మార్కెట్ ర్యాలీతో రిటైల్ పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి

ముంబై : స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత రెండేళ్లలో 3 కోట్ల మందికి పైగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌లోకి వచ్చారు. గత 5 నెలల్లోనే 1 కోటి మంది కొత్త పెట్టుబడిదారులు చేరారు. ఇటి నివేదిక ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఇలో నమోదైన ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్ల క్రితం పెట్టుబడిదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు 9 కోట్లకు పెరిగింది.

దేశీయ స్టాక్‌మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని ఇది సూచిస్తోంది. ఎన్‌ఎస్‌ఇలో నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 6 కోట్ల నుంచి 7 కోట్లకు పెరగడానికి దాదాపు 9 నెలల సమయం పట్టిందని డేటా డెబుతోంది. ఆ తర్వాత కేవలం 8 నెలల్లోనే కోటి మంది కొత్త పెట్టుబడిదారులు వచ్చారు. అంటే వచ్చే 8 నెలల్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్య 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఎన్‌ఎస్‌ఇలో నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్ల నుంచి 9 కోట్లకు పెరగడానికి కేవలం 5 నెలల సమయం పట్టింది.

ఇన్వెస్టర్లు పెరగడానికి కారణాలివే..
ఎన్‌ఎస్‌ఇలో నమోదైన మొత్తం క్లయింట్ కోడ్‌ల సంఖ్య 16.9 కోట్లు అని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో స్టాక్ ఎక్స్ఛేంజ్ పెట్టుబడిదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. వేగవంతమైన డిజిటలైజేషన్, పెట్టుబడిదారులలో పెరుగుతున్న అవగాహన, ఆర్థిక చేరిక, స్టాక్ మార్కెట్ అద్భుతమైన పనితీరు కారణంగా ఎక్కువ మంది పెట్టుబడిదారులు మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్ గురించి మాట్లాడుతూ, ప్రధాన సూచీలు బిఎస్‌ఇ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ రెండూ నిరంతరం రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ 50 ఈ ఏడాదిలోనే నిఫ్టీ 50 దాదాపు 30 శాతం పెరగగా, నిఫ్టీ 500 ఇండెక్స్ దాదాపు 40 శాతం వృద్ధిని నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News