Friday, April 26, 2024

KTR: పెట్రో ధరల దోపిడీ పై కేంద్రానికి కెటిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటుందని ఆయన మండిపడ్డారు.

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచీగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈ మేరకు పెట్రో ధరల దోపిడీపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News