Thursday, May 2, 2024

జంతర్ మంతర్ ఘటనపై కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన రైజర్లకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా..!? అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలిపారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబట్టారు. రైజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని, గౌరవం ఇవ్వాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. నెల రోజులకు పైగా రెజ్లర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే, ఆదివారం ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు రెజ్లర్లపై విరుచుకుపడ్డారు.

అత్యంత దారుణంగా ప్రవర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఆదివారం రణరంగమైన విషయం విదితమే. రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిర్వహించ తలపెట్టారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు.

దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు. నిందితుడ్ని ప్రభుత్వం రక్షిస్తున్నదని వినేశ్ ఫొగట్ ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News