Saturday, July 27, 2024

ఏరోస్పేస్‌లో ఎదురులేని తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ktr

 ఐదేళ్ళలో రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన పెట్టుబడులు
ఏయిరోస్పేస్ రంగంలో మరిన్ని మౌలిక వసతులు
డ్రోన్ పాలసీ ఉన్న తొలి రాష్ట్రం తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో ఒకటని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి దేశం లో మరే రాష్ట్రం సాధించ లేదన్నారు. అ న్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృ ద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎయిరోస్పేస్ మ్యాన్యూఫాక్చరింగ్ లో ప్రప ంచ స్ధాయి కంపెనీలైన బోయింగ్, జిఇ, సఫ్రాన్, రాఫేల్, లాక్ హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు తెలంగాణకు వచ్చాయని మంత్రి కెటిఆర్ వివరించారు. దీ ంతోపాటు స్థానికంగా సూమారు 100 0 ఎయిరోస్పేస్, ఢిఫెన్స్ కంపెనీలు ఎం ఎస్‌ఎం ఈ రంగంలో ఉన్నాయన్నారు.

తెలంగాణలో 4 ఎయిరో స్పేస్ పార్కులున్నాయని, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్స్, హర్డ్ వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్ లున్నాయన్నారు. గురువారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎయిరో స్పేస్ షో వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమం సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పనితీరు వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ లో ఆగ్రస్ధానంలో నిలిచిందన్నారు.

ఎయిరో స్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యత రంగ హోదా ఇచ్చిందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఐదున్నర సంవత్సరాల్లో ఎయిరో స్పేస్, ఢిపెన్స్ రంగం, ఇకో సిస్టమ్ భాగా వృద్ది చెందిందని తెలిపారు. ఎయిరోస్పేస్ రంగంలోని శిక్షణ రంగంలోనూ హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నదని మంత్రి వెల్లడించారు. ఇన్నోవేషన్ రంగంలో టిహబ్, విహబ్ ఉన్నాయని, త్వరలో ప్రారంభం కానున్న టి వర్క్ ద్వారా ఎయిరోస్పేస్, ఢిఫెన్స్ రంగంలో వినూత్నమైన అలోచనలు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే టిహబ్ బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఎయిరోస్పేస్ స్టార్ట్ అప్స్ కంపెనీలతో పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలోని తొలిసారిగా డ్రోన్ పాలసీ తీసుకువచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

ఎయిరోస్పేస్ రంగానికి సైతం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఎటిఎఫ్‌పైన 16 శాతం నుంచి ఒక శాతం తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. దీని వలన ప్రాంతీయ ఎయిర్ లైన్స్ పరిశ్రమ వృద్ధికి ఉపయుక్తంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ది చెందుతున్నదని, ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ‘ఫ్లైయింగ్ ఫర్ అల్’ అనే నినాదంతో జరిగే వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమ స్పూర్తి మేరకు ఎయిరో స్పేస్ రంగం మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్ పల్లి, పెద్దపల్లి, మహబూబ్ నగర్(అద్దకల్)లల్లో ఎయిర్ పొర్టుల ఏర్పాటు, వరంగల్లో ఐటి క్లస్టర్, ఫార్మాసిటీ వంటి చోట్ల సబ్సిడైయిజడ్ హెలీ పోర్టుల ఏర్పాటుకు ప్రణాళిలకు సిద్దం చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

హెలీ పోర్టుల ద్వారా తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ది, నూతన పారిశ్రామిక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరం అయిన అనుమతులు, మౌళిక వసతుల సపొర్ట్ కోసం నిధులు ఇవ్వాలని కోరారు. మార్చ్ నెలతో జరగనున్న ఈ వింగ్స్ ఇండియా -2020 కార్యక్రమానికి అతిథ్యం ఇస్తుండం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్, ఈ కార్యక్రమం ద్వారా ఎయిరో స్పేస్, ఢిఫెన్స్ రంగంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుకలుగుతుందని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.

పలు కంపెనీ ప్రతినిధులను కలిసిన మంత్రి కెటిఆర్

వింగ్స్ ఇండియా 2020 కోసం ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్ పలు ప్రముఖ ఎరోస్పేస్, ఢిఫెన్స్ రంగ కంపెనీల ప్రతినిధులను కలిసారు. ఎయిర్ బస్, జిఇ ఎవియేషన్, సాఫ్రాన్, బిఎఇ (బే) కంపెనీల ఇండియా అధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుతం అయా కంపెనీలు నిర్వహిస్తున్న కార్యకలాపాలపైన చర్చించారు. దీంతోపాటు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎయిరో స్పేస్, ఢిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తున్నదని తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ సహాకారం, చొరవ వలన ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుడులు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం దేశంలో ఎయిరో స్పేస్ రంగంలో మరింత వృద్దికి అవకాశాలున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ రంగానికి ప్రాధన్యత ఇస్తున్నదని కంపెనీల ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మరిన్ని మాన్యూఫాక్చరింగ్ (తయారీ) రంగంలో పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. దీంతోపాటు ఎయిరో స్పేస్ రంగంలో శిక్షణ ( స్కిల్లింగ్) రంగంలో జిఇ, ఎయిర్ బస్, సాఫ్రాన్ వంటి కంపెనీల భాగసామ్యన్ని కోరారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరం అయిన మానవ వనరుల కోసం తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరపున శిక్షణ ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు.

శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఎయిరో స్పేస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరం అయిన టెక్ సపొర్ట్ సేవలను వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి కూడా అందించేందుకు అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఎయిర్ బస్ ఇండియా సిఇఒ అనంద్ స్టాన్లీ, సాఫ్రాన్ ఇండియా సిఇఒ పియర్రీ డికెలీ, బె సిస్టమ్స్ ఎండి నిక్ కన్నా, జిఇ ఎవియేషన్ ఇండియా అధినేత (కంట్రీ హెడ్) విక్రమ్ రాయ్, తలాస్ కంపెనీ ఉపాద్యక్షులు కపిల్ కిషోర్, యూనైటెడ్ టెక్నాలజీస్ ప్రాంతీయ డైరెక్టర్ సమిత్ రే తదితరులు మంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో ఢిల్లీ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఉన్నారు.

KTR speech at Wings India 2020 Curtain Raiser Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News