- Advertisement -
లక్నో: సమాజ్ వాది పార్టీకి చెందిన ఓ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో మౌ జిల్లాలోని ముహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఎస్ పి పార్టీ లోకల్ నాయకుడు బిజ్జి యాదవ్(39) వాకింగ్ కోసం బయట వెళ్లగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి తుపాకితో కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలంకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Local Samajwadi Party leader shot dead in UP
- Advertisement -