Tuesday, January 14, 2025

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బీభత్సం…

- Advertisement -
- Advertisement -

Maoists set fire to goods train engine

 

ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి,భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడవిలో ఆపి, గత రాత్రి మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్‌కు నిప్పంటించారు. 15 నుంచి 20 మంది సాయుధ నక్సలైట్లు ఆయుధాలతో వచ్చి రైలును నిలిపివేసి, ముందుగా దాని పైలట్ మరియు గార్డును దించి, ఆపై ఇంజిన్‌కు నిప్పంటించారని చెబుతున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి నక్సలైట్లు తమ ఉనికిని చాటుకోవడంతోపాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. కిరణ్ దోల్ నుండి విశాఖపట్నం రైలు మార్గంలో రవాణా నిలిచిపోయింది. రైల్ ఇంజన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News