- Advertisement -
హైదరాబాద్ : అస్వస్థతకు గురైన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు గురువారం మధ్యాహ్నాం పరామర్శించారు. బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన ఇరువురు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిశోర్ కుమార్, ట్రాన్స్ కో, జెన్ కో సిఎండీ ప్రభాకర్ రావులతో పాటు సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పీటిసి మేడి భిక్షం, ఎంపిపి నేమ్మాది భిక్షం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు మంత్రిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
Minister Harish Rao Meet Jagadeesh Reddy
- Advertisement -