- Advertisement -
విశాఖపట్నం, విజయనగరం, విజవాడ మార్గాలల్లో
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రయాణికుల రద్దీ మార్గాలల్లో ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ల మధ్య నాలుగు ప్రత్యేక రైల్వే సర్వీసులు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ నెల 13నుండి20వ తేదీల మధ్య వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అలాగే విశాఖపట్నం-విజయవాడల మధ్య నాలుగు డబుల్ డెక్కర్ సర్వీసులు ఈ నెల 12వ తేదీ నుండి19వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు.
Special Trains for Sankranthi
- Advertisement -