Thursday, April 25, 2024

డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు

- Advertisement -
- Advertisement -

minister jagadish reddy comments on pm modi

సూర్యాపేట: ప్రధాని నరేంద్రం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే పింఛన్ కేవలం 750 రూపాయలు మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు ఇచ్చే పింఛన్ 600 రూపాయలు మాత్రమే నని ఆయన తేల్చిచెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రలలో మొదటిది ఈ దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అటు వృద్దులు, వితంతువులతో పాటు వికలాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తం కూడ అక్షరాల 600 రూపాయలు మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నూతన ఫింఛన్లను సూర్యాపేట పురపాలక సంఘం, సూర్యాపేట రూరల్ లలో లబ్దిదారులకు శనివారం ఆయన అందజేశారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…. అదే బీజేపీ రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న మధ్యప్రదేశ్ లో అందరికి సర్వసమానంగా 600 రూపాయలుపింఛన్లు పేరు మీద విదిలిస్తుండగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ దొడ్డి దోవన అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోను ఇచ్చే పింఛన్ 600 మాత్రమేనని ఎద్దేవాచేశారు.

తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాలీనా 800 కోట్లు ఇస్తుండగా రాష్ట్రం ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పింఛన్ల పేరుతో సాలీనా 12,000 కోట్లు చెల్లిస్తుందన్నారు. వృద్దులకు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, దివ్వాంగులకు 3,016 రూపాయలు పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. డబుల్ ఇంజిన్ల పేరుతో రాజకీయం వెలగ బెడుతున్న కమలనాధులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లే ట్రబుల్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ఈ పింఛన్లతోటే బిజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ తిరుగుబాటు సంభవిస్తుందో నన్న మీమాంస వారిని వెంటాడుతున్నట్లుందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కిందా మీద పడుతుందని దుయ్యబట్టారు.

బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వక పోవడం,రాష్ట్రం నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు తిరిగి రాష్ట్రానికి అందించకుండా మొకలడ్డుతున్నారనిఆయన మండిపడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా మంజూరు అయిన 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. కొత్తగా మంజూరు అయిన పింఛన్లతో కలుపుకుని ఒక్క సూర్యాపేట నియోజకవర్గం లోనే 38068 మంది లబ్ధిదారులు ఉండగా నెలకు 9.1 కోట్లు సాలీనా 108 కోట్లు చెలిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. 2014 నాటికి 28,188 మంది లబ్దిదారులకు నెల ఒక్కింటికీ కేవలం 3.5 కోట్లు ఉండగా ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 38,068 మందికి నెల ఒక్కింటికీ 9.1 కోట్లు నేరుగా పింఛన్ దారుల అకౌంట్ లో ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుంటా జమ అవుతున్నాయన్నారు.

అంతే గాకుండా ఋణమాఫీ పేరుతో 25 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర తెలంగాణ సిఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. అందుకు భిన్నంగా బిజెపి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అన్నింటికీ మించి తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మార్గదర్శనంలో సరఫరా అవుతున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా బిజెపి పాలకులకు కంటగింపుగా మారిందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటల మాత్రమే నన్నారు. అక్కడ అరనిమిషం కుడా ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారమే రైతాంగం నుండి ముక్కు పిండి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఎగిరెగిరి పడుతున్న ఈ బిజెపి పాలనలోనే కదా ఎక్కడో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 1100 పై చిలుకు ఎగబాకిందని ఆయన తెలిపారు. అంతే గాకుండా అటు డీజిల్ ఇటు పెట్రోల్ ధరల పెరుగుదల కు హద్దు అనేది లేకుండా పోయిందన్నారు.అటువంటి పార్టీ నేతలు ఇటువంటి సంక్షేమాన్ని అడ్డుకోజూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాల్సింది పథకాలు అనుభవిస్తున్న లబ్దిదారులేనని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News