Saturday, April 27, 2024

ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారవు స్పందించారు. ఆ దుర్ఘటనలో 233 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. రైలు ప్రమాదాన్ని నివారించే యాంటీ కొలిజన్ డివైస్‌లు ఏమైనట్లు అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ప్రమాద తీవ్రత చాలా ఊహించని రీతిలో ఉందని, ఈ విషాదం జరగాల్సింది కాదని కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News