Tuesday, May 7, 2024

జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR To Visit Zaheerabad

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంత్రి కెటిఆర్ బుధవారం పర్యటిస్తున్నారు. మండలంలో రూ. 50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జహీరాబాద్ లో ప్రతి వార్డులో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామన్నారు. సిసి రోడ్లు, మోరీలు కమ్యూనిటీ హాళ్ల కోసం నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలోనే 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News