Friday, May 3, 2024

బాన్సువాడ ప్రజలకు ఏం కావాలో పోచారంకు తెలుసు

- Advertisement -
- Advertisement -

Harish rao Laying Foundation for Jakora Lift Irrigation

బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి మంత్రి హారీశ్ రావు, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. బాన్సువాడలో ప్రజలకు ఏం కావాలో పోచారం శ్రీనివాసరెడ్డికి తెలుసని మంత్రి హరీశ్ అన్నారు. జీవితాంతం బాన్సువాడ ప్రజలకు మేలు చేయాలని పోచారం తపిస్తారని మంత్రి పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని మంత్రి స్పష్టం చేశారు. జాకోరా ఎత్తిపోతలతో కష్టాలు తీరుతాయని ఇక్కడికొచ్చిన ప్రజల కళ్లలో ఆనందం కనపడుతోందన్నారు.

జాకోరా లిప్ట్ చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టినవి ఏవీ లేవు. రాష్ట్రంలో ధాన్యం చూసి కేంద్ర మంత్రుల్లో ఆశ్యర్యపోతున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో ధాన్యం ఈ స్థాయిలో పండుతోంది. బాయిట్డ్ రైస్ కొనరంట… రా రైస్ కావాలంట?.. ఈ యాసంగిలో రా రైస్ పండుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపు మంట లేస్తుందన్నారు. గతంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులతో ఆకాశం వైపు చూసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొరత, ఎరువుల కొరత ఉండేదని మంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ ఐరాన్ లెగ్గు. ఎక్కడ అడుగు పెట్టిన కాంగ్రెస్ 94 శాతం ఓడింది. గెలిచింది 6 శాతం. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడ్రస్ గల్లంతు ఇక్కడ ఉద్దరిస్తార.. కాంగ్రెస్ ఇక గత చరిత్ర. రైతులకు బిజెపి చేసిన ఒక్క పని చెప్పండి. అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ నిజాయతీ అయితే, బిజెపి తొండి పంచాయతన్నారు.

మనం ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బిజెపి వాళ్ళ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో పంట పండితే వాళ్ల గుండె మండుతున్నది. ఏడేళ్ళలో 99 లక్షల టన్నుల నుండి 2.59 లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. ముఖ్యమంత్రి కృషి వల్లనే సాధ్యమైంది. మంత్రులు డిల్లీకి వెళ్లి యాసంగి వడ్లు కొనాలి అంటే.. అవమానించారు. పీయూష్ గోయల్ మంత్రం వేశారా ఇంత పంట ఎలా పండింది అంటరు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారం తెలంగాణ. రైతులు నష్ట పోవద్దని మేమే కొనుగోలు చేస్తాం అని, 3000 కోట్లు అయినా భరించేందుకు సిఎం కెసిఆర్ ముందుకు వచ్చారు. గతంలో నీళ్ల కోసం నిజామాబాద్, బాన్సువాడ లో నిరహార దీక్షలు చేసాము. కానీ ఇప్పుడు ముఖాన్ని మొగులు వైపు పెట్టీ చూడాల్సిన అవసరం లేదు. మల్లన్న సాగర లో గేటు ఎత్తితే, నిజాం సాగర్ కు నీళ్ళు వస్తాయి. జాకోరా లిఫ్ట్ పెడితే మీ ఊల్లతో నీళ్ళు వస్తాయని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News