Friday, May 3, 2024

శత్రుచర్ల చంద్ర శేఖర్ రాజు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

Shatrucharla

పార్వతీపురం మన్యం: మాజీ శాసనసభ్యుడు, టిడిపి నేత శత్రుచర్ల చంద్రశేఖరరాజు(72) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో విశాఖలో చికిత్స పొందుతున్న చంద్రశేఖరరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. శత్రుచర్ల ఇకలేరని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. టిడిపి నేత భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి చంద్రశేఖరరాజు స్వయాన మామ అవ్వగా.. టిడిపి నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు. చంద్రశేఖరరావు మృతిపట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్,  వైసిపి నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News