హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, వైసిపి నాయకుడు మంచు మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన మోహన్ బాబు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కలుసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ప్రధానితో మోహన్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మోహన్ బాబును ప్రధాని మోడీ బిజెపిలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇక, ప్రధాని మోడీని కలిసిన ఆనందాన్ని మంచు లక్ష్మీ ట్వీట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. డైనమిక్ లీడర్ను కలిశానని ఆమె ట్వీట్లో కామెంట్ చేశారు. అయితే, ఇంత సడన్ గా ప్రధాని మోడీని కలువడంతో మంచు ఫ్యామిలీ మొత్తం బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వయంగా వైసిపి కండువ కప్పుకొని వైయస్ఆర్సిపిలో జాయిన్ అయ్యిన మోహన్ బాబు.. ఇప్పుడు మోడీని కలువడంతో ఎపి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Just met The DYNAMIC Hon'ble Prime Minister @narendramodi JI. If only India could hear his vision clearly and purely we would be in a greater place.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 6, 2020
Mohan Babu family met with PM Modi in Delhi