- Advertisement -
తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నది. మలయప్ప స్వామివారు స్వర్ణరథంలో తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నారాయణ గిరి ఉద్యనవనం దాటి భక్తులు క్యూలో నిలబడ్డారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎలు జీవన్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డిలు ఉన్నారు. విఐపిల దర్శనం అనంతరం సాధారణ భక్తులు కూడా ఉత్తర ద్వార స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలో యాదాద్రి, భద్రాది ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
More Devotees in vaikunta ekadasi 2020 in Tiurmala
- Advertisement -