Tuesday, April 30, 2024

మూఢనమ్మకాలతో బిడ్డను చంపుకుంది…

- Advertisement -
- Advertisement -

mother killed six month old baby In Suryapet

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాడు తండాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాలతో అభం శుభం తెలియని ఆరునెలల పసిపాపను తల్లి హతమార్చింది. మేకలపాడు తండాలో నివాసముంటున్న బనోతు భారతి ఆరేళ్ల క్రితం విహహం జరిగింది. ఆరోగ్య పరిస్థితి బాగలేక మూఢనమ్మకాలకు బానిసైపోయింది. ఇటీవల ఓ సాధువు ఆమెకు నాగదోషం ఉందని చెప్పడంతో ఆరు నెలల బిడ్డను బలివ్వాలని నిర్ణయించింది. భర్త ఇంట్లో లేని సమయంలో శివుడు బొమ్మను పక్కనపెట్టుకుని పాప గొంతు కోసం హత్య చేసింది. ఆ యువతి బిఎస్సీ బిఈడి చదివిందని, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News