- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి మున్సిపాలిటీలకు 11,179 మంది, కార్పొరేషన్లకు 1747 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. మొత్తం 7961 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 45 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపునకు 10 వేల మంది సిబ్బందిని వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 2406 కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఉండనుంది. 50 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు.
Municipal Elections Polling Started in Telangana
- Advertisement -