Saturday, April 20, 2024

థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా

- Advertisement -
- Advertisement -


సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో జయంత్‌ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె. మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా ‘నెల్సన్’ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో మొదలైంది. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, ’పుష్ప’ ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్-, మనోజ్-గిరి, -జయంత్- సాయి సునీల్, సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శివ దేవరకొండ, ఫైట్స్: శివ్ రాజ్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News