Sunday, April 28, 2024

తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండదు: కెసి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీనిని మంగళ వారం సాయంత్రం అధికారింగా పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సిఎం ప్రకటన అనంతరం కెసి వేణు గోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీలోని సీనియర్లందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండబోదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించాకే సమిష్టిగా తీసుకుంటామని తెలిపారు.

కాన్వాయ్ సిద్ధం.. రాజ్‌భవన్‌లో 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రొటోకాల్ అధికారులు కాన్వాయ్ సిద్ధం చేయగా, రాజ్ భవన్‌లో ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు రేవంత్‌ రెడ్డి సిఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News