Saturday, July 27, 2024

డబుల్ మర్డర్ కలకలం

- Advertisement -
- Advertisement -

Murder

 

 

ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో (12) కలిసి కె బ్లాక్‌లో నివసిస్తోంది. ఆమె ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పూజా ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు పొరుగువారు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. రెండు మృతదేహాలు బెడ్‌రూమ్‌లో పడి ఉన్నాయి. గుర్తు తెలియన వ్యక్తులు తల్లిని చంపిన తరువాత కుమారుడు హత్య వివరాలు బయటకు చెబుతాడనే అనుమానంతో ఆమె తనయుడిని కూడా దుండగులు హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలు మూడు  రోజుల క్రితం జరిగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. జహంగీర్ పూర్ లో డబుల్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది.

North East Delhi Double Murder in Jahangirpuri Area,woman and her minor son were found murdered in their flat
Delhi Double Murder in Jahangirpuri Area
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News