తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసుపై (Obulapuram mining case) తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సిబిఐ కోర్టు తీర్పు యాంత్రికంగా ఉందని అందులో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిందని కోర్టుకు వెల్లడించారు. కేసు విచా రణ సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పా రు. నేరాలకు పాల్పడినందుకే సిబిఐ కోర్టు శిక్ష వేసిందని సిబిఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదు పరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
నేడు శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ
ఓబులాపురం మైనింగ్ కేసులో (Obulapuram mining case) ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై తెలంగాణ హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టనుంది. 2022లో సిబిఐ సమర్పించిన ఆధారాలు సరిపోవని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి, ఆమెను కేసు నుంచి డిశ్చా ర్జ్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని గత మేలో సిబిఐని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై మరోసారి మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో ఆమె నేర ప్రమేయం ఉందా? లేదా? అని నిర్ధారించి, సరైన ఆధారాలుంటే శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.