Friday, April 26, 2024

మద్యం అనుకొని పురుగుల మందు తాగాడు.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

పెద్దపల్లి: మద్యం అనుకొని పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నమ్‌పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మిల్కుల గట్టయ్య (40) అనే వ్యక్తి ప్రతి రోజు మద్యం సేవించేవాడు. మద్యం సీసాలో పురుగు మందు పోయడంతో వైన్ అనుకొని సేవించాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి. ప్రగతి తెలిపారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.

 

One Man Dead with Drunk Festicide in Peddapalli
One Person Dead with Drunk Pesticides instead Wine

 

One Person Dead with Drunk Pesticides instead Wine
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News