- Advertisement -
బెంగళూరు: కర్నాటకలోని ఉడిపి ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో విహార యాత్రకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 45 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉడిపి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అనంతపురంలోని కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. చనిపోయిన విద్యార్థి పక్రూద్దీన్ గా గుర్తించారు.
One Student Died in Bus Accident in Ananthapuram
- Advertisement -