Saturday, July 27, 2024

సిపి సజ్జనార్‌పై ఒవైసి ట్విట్టర్ వార్

- Advertisement -
- Advertisement -

CP Sajjanar

 

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనర్ సిపి సజ్జనార్‌పై ఎంఐఎం అధినేత ఎంపి అసదుద్దీన్ ఒవైసి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో జిహాదీలు పనిచేస్తున్నారా? పోలీసులు తనిఖీలు చేశారా అంటూ ఓ వ్యక్తి సైబరాబాద్ పోలీసులను ప్రశ్నించాడు. దీనికి సిసి సజ్జనార్ స్పందిస్తూ అలాంటి వారు ఉంటే గుర్తించేందుకు ఓ విభాగం 24గంటలు పనిచేస్తోందని సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పోలీసుల నిఘా నిత్యం ఉంటుందన్నారు. సిపి సజ్జనార్ వ్యాఖ్యలపై ఎంపి అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయండి కానీ తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ పేరుతో చంపేయకండని ట్విట్టర్లో ఘాటుగా వాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎంతమంది జీహాదీలను గుర్తించారో చెప్పాలని సిపిని కోరారు.

Owaisi Twitter War on CP Sajjanar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News