- Advertisement -
హైదరాబాద్: నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ రోజు జెఆర్సి కన్వెషన్ సెంటర్లో జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుకలో ఈ మూవీ ట్రైలర్ ను ముఖ్య అథితిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లో ‘ఎదురించేవాడు వచ్చేంత వరకే రా భయపెట్టేవాడి రాజ్యం’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్లు రజినీకాంత్, మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాలకు పోటీగా తన సినిమాని సంక్రాంతికి కానకగా జనవరి 15న రిలీజ్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది.ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
Entha Manchivadaruraa Trailer released
- Advertisement -