Wednesday, May 8, 2024

వయనాడ్ లో రికార్డు శాతం పోలింగ్.. రాహుల్ గాంధీ గెలిచేనా?

- Advertisement -
- Advertisement -

లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో కేరళలో భారీగా ఓటింగ్ జరిగింది. అధిక సంఖ్యలో జనాలు తమ ఓట్ ను వినియోగించుకున్నారు. దీంతో కేరళలో 70.12 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ ఏకంగా 72.70 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

కాగా, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ పోలింగ్ పై బిజెపి, కాంగ్రెస్ రెండు పర్టీలు ధీమాగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News