Saturday, April 27, 2024

లోయలో పడిన ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు వంద అడుగుల లోయలో పడడంతో నలుగురు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు, నర్సీపట్నం, విశాఖలో కెజిహెచ్ కు తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారుగా 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి బస్సు లోయలో పడింది. చోడవరం నుంచి పాడేరు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు, గాయపడినవారి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:  చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News