Saturday, April 20, 2024

ఎసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

Panchayat Secretary

 

అబ్దుల్లాపూర్‌మెట్: లంచం తీసుకుంటు ఓ పంచాయతీ కార్యదర్శి ఎసిబి వలకు చిక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. గౌరెల్లి గ్రామానికి చెందిన చింతకాయల రాజు అనే వ్యక్తి తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కి దరాఖాస్తు చేశాడు. ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గత నాలుగు నెలల నుండి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

ఇంటి నిర్మాణం అనుమతి కోసం చంద్రశేఖర్ రూ.25వేలు లంచం డిమాండ్ చేయడంతో ఇంటి యజమాని రాజు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం గౌరెల్లి పంచాయతీ కార్యాలయంలో ఇంటి యజమాని రాజు నుండి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిసిపి సూర్యనారాయణ ఆద్వర్యంలో రెడ్‌హ్యండ్‌గా పట్టుకున్నారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చి జైల్‌కు తరలించారు.

Panchayat Secretary caught to ACB
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News