Monday, May 13, 2024

జూన్ 14న సంత్ తుకారాం ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Modi to inaugurate Sant Tukaram Temple

పూణె:  టెంపుల్ టౌన్ దేహూలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సంత్ తుకారాం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ఆది, సోమవారాల్లో నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తామని, మంగళవారం నిషేధం ఉంటుందని ధర్మకర్తలు తెలిపారు. వేడుకకు సన్నాహాల్లో భాగంగా మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆలయాన్ని సందర్శించినట్లు పింప్రి-చించ్వాడ్ సీనియర్  పోలీసు అధికారులు తెలిపారు. సంబంధిత కేంద్ర భద్రతా నిర్మాణాలతో సంప్రదింపులు జరిపి, బహుళస్థాయి భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరిస్తామని చెప్పారు.

సంత్ తుకారాం మహారాజ్ సంస్థాన్ ధర్మకర్తలు ప్రధాని పర్యటన కారణంగా ఆలయాన్ని ఆదివారం నుండి మూసివేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ఆది, సోమవారాల్లో భక్తుల ప్రవేశాన్ని నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తామని ధర్మకర్తలు తెలిపారు. భక్తుల దర్శనం కోసం వివిధ ప్రాంతాల్లో డిస్‌ప్లే స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ధర్మకర్తలు తెలిపారు.

సంత్ తుకారాం శిలా మందిరాన్ని మంగళవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ‘శిల’ అనేది ప్రస్తుతం దేహు సంస్థాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక శిలని సూచిస్తుంది ,  ఇది శతాబ్దాలుగా పంధర్‌పూర్‌కు వార్షిక తీర్థయాత్ర చేసేవారికి  ప్రారంభ స్థానం. సంత్ తుకారాం , ఆయన కార్యాలు మహారాష్ట్ర అంతటా వ్యాపించిన వార్కారీ శాఖకు ప్రధానమైనవి. కుల రహిత సమాజం గురించి ఆయన ఇచ్చిన సందేశం, ఆచారాలను తిరస్కరించడం సామాజిక ఉద్యమానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News