Thursday, May 8, 2025

దేశానికి తెలంగాణ ఆర్ టిసి రోల్ మోడల్: పొన్నం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గత ప్రభుత్వం ఆర్టిసినీ నిర్వీర్యం చేస్తా తాము ఆర్టిసిని నిలబెట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్ తెలిపారు. ఆర్ టిసికి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని వెల్లడించారు. దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సు లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు ఆర్ టిసి బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికుల హర్షం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో పొన్నం ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టిసిలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపో కి చెందిన ఎక్స్ ప్రెస్ బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండడంతో మహా లక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని కొనియాడారు.

ఆర్టిసి కొత్త బస్సులు కొనుగోలు చేశామని దేశానికి తెలంగాణ ఆర్ టిసి రోల్ మోడల్ గా నిలుస్తుందని పొన్నం మెచ్చుకున్నారు. తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. విద్యార్థులతో మాట్లాడారని, బాగా చదువుకోవాలని సూచించారు. ఆర్టిసి డ్రైవర్, కండక్టర్ తో మాట్లాడి, ఆర్టిసి సమస్యలు పరిష్కారం చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. నిన్న జెఎసి నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పామని, సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్ టిసి ఉద్యోగులకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News