Saturday, July 27, 2024

దళిత యువకుడిపై పెట్రోల్ పోసి… నిప్పంటించారు…

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: ఓ దళిత యువకుడిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దళిత కుటుంబం, మరో కుటుంబానికి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో దళిత యువకుడిని నలుగురు పట్టుకొని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో యువకుడు 70 శాతం కాలిన గాయాలతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాలిన యువకుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Poured kerosene on MP Dalit Man, set with Fire

 

Poured kerosene on MP Dalit Man, set with Fire
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News