- Advertisement -
తమిళ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కాంబోలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ‘కుబేర’. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పోయి రా మావా..’ అనే తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ను ధనుష్ పాడారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ధనుష్.. బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నారు.
- Advertisement -