- Advertisement -
న్యూఢిల్లీ : నాగాలాండ్లో పౌరులపై ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల ఘటన ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా శనివారం ఈ ఘటనను నిరసిస్తూ కేంద్రహోం మంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అమిత్షా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన వివరణ పూర్తిగా తప్పని, కల్పిత విషయమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు అమిత్షా వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎఎఫ్ఎస్ఎ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసనకారులు మరోసారి డిమాండ్ చేశారు.
- Advertisement -