Thursday, May 2, 2024

ఏప్రిల్ 14న ‘దరువెయ్యరా’..

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘రామబాణం’.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో జగపతి బాబు, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న ‘రామబాణం’ను విడుదల చేనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News