Friday, March 29, 2024

కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape

 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ప్రాంతం కరోండ్‌లో కదులుతున్న కారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ తన భర్త వదిలి వెళ్లిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తోంది. సదరు మహిళ అనారోగ్యంగా ఉండడంతో కోళార్‌లో ప్రాంతంలో ఉన్న జెకె ఆస్పత్రికి వెళ్తోంది. మార్గ మధ్యలో జావిద్ అనే తెలిసిన వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్తునని కారు ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం తీసుకెళ్లాక మరో వ్యక్తితో కలిసి జావిద్ కారులో మద్య సేవించారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. ఎవరుకైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఘటనా జరిగినా 24 గంటల తరువాత ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జావిద్, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Rape on bhopal women in Run Car in Madhya Pradesh, Women (43) was allegedly abducted and gangraped by two men in a moving car on the outskirts of Bhopal

 

Rape on bhopal women in Run Car in Madhya Pradesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News