టెండర్ ఓట్లు పడటంతో ఈసి నిర్ణయం
హైదరాబాద్: టెండర్ ఓటింగ్ జరిగిన మూడు మున్సిపాలిటీల పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 41కి చెందిన పోలింగ్ స్టేషన్ 198, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 41లో పోలింగ్ స్టేషన్ 101లో, బోధన్ మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 32, పోలింగ్ స్టేషన్ 87లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. అర్హులైన పోలింగ్ ఏజెంట్లను నియమించుకోకపోవడం లేదా పోలింగ్ ఏజెంట్లు కుమ్మక్కు కావడం లాంటి కారణాలతో అర్హుల ఓట్లు ముందుగానే ఇతరులు వేసి ఉంటారనీ, దీనితో ఆ మూడు చోట్ల అధికారులు టెండర్ ఓటుకు అధికారులు అకాశమిచ్చి ఉంటారని రీపోలింగ్ నోటిఫికేషన్ లో ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
Re Polling At Three Polling Centers At Telangana