- Advertisement -
వికారాబాద్: బైక్ ను కారు ఢీకొట్టడంతో రిటైర్డ్ ఎఎస్ఐ మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రిటైర్డ్ ఎఎస్ఐ సాయిలు పొలానికి వెళ్లి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా కారు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Retired ASI Dead in Car collided to Car in Parigi
- Advertisement -