Wednesday, April 24, 2024

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Jagitya: Three killed

వెల్గటూరు: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని వెల్గటూరు మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ధర్మపురికి చెందిన సుధా, ప్రిన్షిత, మీకారాణిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News