Saturday, April 27, 2024

కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Karnataka Assembly deputy Speaker passes away

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఉప సభాపతి ఆనంద్ మమణి శనివారం అర్థరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు లోని ఓ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. 56 ఏళ్ల మమణి నవదట్టి నియోజక వర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్‌ఎల్‌ఎగా గెలుపొందారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఆయన లివర్ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. ఆయన కోమా లోకి వెళ్లడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం తమిళనాడు లోని చెన్నైకి తరలించారు.. ఆ తరువాత బెంగళూరుకు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News