మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో శూ న్యత నెలకొన్నదని, దానిని భర్తీ చే సుకుంటూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ తాను బహిర్గతం చేయలేనని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు చూసి విసిగి పో యిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూ స్తున్నారని రాంచందర్ రావు శనివారం పార్టీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. సిఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, బిజెపి ఫొబియా పట్టుకున్నదని రాంచందర్ రావు విమర్శించారు. పొద్దున లేచినప్పటి నుంచి బిజెపి లేదా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎంత ఫొబియా పట్టుకున్నదో అర్థమవుతున్నదని అ న్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమాగా చెప్పారు. అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహపడుతున్నారని, ఇప్పటికే చాలా దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మీ హామీలకు కేంద్రం ఏమి చేస్తుంది.మీ హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదంటూ విమర్శిస్తూ, బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు-1 పరీక్ష నిర్వహించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించలేక చతికిలపడిందని ఆయన దుయ్యబట్టారు.
జీతాలకు డబ్బులు లేవు
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు, ఆరోగ్య శ్రీ నడపడానికి డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీకి వెళ్ళి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించారని రాంచందర్ రావు విమర్శించారు. నిధులు లేవంటూ కేంద్రంపై ఏడ్వడం దేనికని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి బడే భాయ్ అంటూ లోగడ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిపాలన వేరు, రాజకీయాలు వేరని అన్నారు. బిజెపి-బిఆర్ఎస్ కలిసే ఉన్నాయని, కాంగ్రెస్-బిజెపి ఒక్కటేనని ఇలా రకరకాలుగా కామెంట్లు వస్తూనే ఉన్నాయని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తుస్సుమన్న రాహుల్ బాంబ్
ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన హైడ్రోజన్ బాంబ్ తుస్సుమన్నదన్నారు. ఓట్ చోరీ అంటూ ప్రజలను భయభ్రాంతులకు, అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీ నినాదమే తప్పన్నారు. నకిలీ ఓట్ల ఏరి వేత, ఒకే ఇంట్లో వంద ఓట్లు ఉంటే పరిశీలించడం, కొంత మందికి రెండు చోట్ల ఓట్లు ఉండడం, మరణించిన వారి ఓట్లు కొనసాగడం వంటి వాటిని ఎన్నికల కమిషన్ పరిశీలన చేసి వాటిని సరి చేయాలని, సంస్కరణలు తేవాలని రాంచందర్ రావు సూచించారు. మజ్లీస్ పార్టీ నేతలకు భయపడి బోగస్ ఓట్ల ఏరి వేతను చేపట్టడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఒకసారి రిజష్టర్ అయిన ఓట్లను తొలగించాలంటే సాధ్యం కాదని, దానికి దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వత బూత్ స్థాయి అధికారి పరిశీలన తర్వాతే తొలగించడం జరుగుతుందన్నారు. ఇవిఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ వంటి అక్రమాలు తగ్గాయని ఆయన తెలిపారు.
కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం కూలిన పిల్లర్లపై కోరడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సిబిఐ విచారణపై విశ్వాసం ఉందన్నారు. కాళేశ్శరం ఏటిఎంలా మారిందని కేంద్ర మంత్రి అమీత్ షా కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.
నక్సల్స్తో జానారెడ్డి చర్చలేమయ్యాయి..
నక్సల్స్తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నక్సల్స్ ప్రతినిధులతో జానారెడ్డి కమిటీ జరిపిన చర్చలు ఏమయ్యాయని రాంచందర్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో కుంటుపడుతూ అవినీతిలో పెరుగుతున్నదని ఆయన విమర్శించారు.
రాజా సింగ్పై నో-కామెంట్
బిజెపి నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్పై చేస్తున్న వివాదస్పద ప్రకటనల గురించి తాను మాట్లాడనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తాను ఇప్పుడు ఏది మాట్లాడినా, వెంటనే రాజా సింగ్ కౌంటర్ ఇస్తారని, మళ్లీ తాను స్పందించాల్సి ఉంటుందని చెప్పి దాట వేశారు.
Also Read: రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కల్వకుంట్ల కవిత