ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు మరోన్నో అద్భుత ఫీచర్లును శాంసంగ్ అందిస్తోంది. ఈ ఫోన్ రూ. 24,485 ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎ51 ఫీచర్లు….
6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్ప్లే,
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్,
6/8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్,
48, 12, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు,
32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జి వివొఎల్టిఇ,
బ్లూటూత్ 5.0, యుఎస్బి టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను కస్టమర్లకు అందిస్తున్నారు.
Samsung Galaxy A51 Features And Price