- Advertisement -
హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ మరణమృదం మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కరోనాపై అప్రమత్తమైయ్యాయి. దీంతో కేంద్రం నుంచి ప్రత్యేక వైద్య బృందం హైదరాబాద్ కు చేరుకుంది. అయితే, నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు కరోనా వైరస్ అనుమానితులు చేరినట్టు తెలుస్తోంది. అటు ఫీవర్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది. కరోనా వైరస్ వార్డులు ఎలా ఉండాలనేదానిపై బృందం ప్రత్యేక సూచనలు చేయనుంది. వైద్యబృందంలో చైన్నై, హైదరాబాద్, డిల్లీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 106కు చేరుకుందని చైనా అధికార వర్గాలు చెబుతున్నాయి.
Central team inspects Gandhi Government Hospital
- Advertisement -