- Advertisement -
సూపర్స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందనా కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ నెల 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. కామెడీ సన్నివేశాలతో షురూ అయి.. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, మహేశ్, విజయశాంతి పంచ్ డైలాగులతో సాగే ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చుట్టూ వందమంది మధ్యలో ఒకడు.. టచ్ చేయండి ఎవడైనా వెళ్లి టచ్ చేయండి.. అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. పూర్తి అనిల్ రావిపూడి మార్క్తో ఈ ట్రైలర్ మూవీ లవర్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Sarileru Neekevvaru movie trailer release
- Advertisement -