Saturday, July 27, 2024

రాష్ట్ర ఉర్ధూ అకాడమీ డైరెక్టర్ మహ్మద్ గౌస్‌కు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

Urdu

 

హైదరాబాద్: రాష్ట్ర ఉర్థూ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ గౌస్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సభ్యులు వహిద్ ఆహ్మద్‌లు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ఉర్థు భాషాభివృద్ధికి ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ను నియమించారని వెల్లడించారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉర్ధూను ద్వితీయ భాషగా అమలు చేస్తుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా సిఎంకెసిఆర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Urdu as Second Language in State
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News