Friday, March 29, 2024

రెండో భర్త అత్యాచారం చేశాడని పిఎస్‌లో భార్య ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Rape

 

చెన్నై: రెండో భర్త తనపై అత్యాచారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్‌లో నటీమణి ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులోని తిరుమంగళంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ మొదటి భర్తతో విడాకులు తీసుకొని అన్నానగర్‌లో బ్యూటీషియన్ నడిపిస్తూ… సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. ఆమెకు ఓ వ్యాపారివేత్త శరవణ్ణన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెళ్లి దారితీసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్న అనంతరం ఇంటికి స్నేహితులను తీసుకొచ్చి వారి ముందు డ్యాన్స్ చేయమని శరవణ్ణన్ ఆమెను వేధించేవాడు. దీంతో ఆయన వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జనవరి 8న తనని బంధించి తనపై దాడి చేయడమే కాకుండా అత్యాచారం చేశాడని, ఆశ్లీల దృశ్యాలు వీడియో తీసి బయటకు చెబితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత తన వద్ద నుంచి 25 లక్షల రూపాయలు, వంద తులాల బంగారం తీసుకున్నాడని తెలిపింది.

 

Second Husband rape on Wife, her complaint in PS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News